డ్రగ్స్ గ్యాంగ్ లీడర్కి మరణ శిక్ష..
- December 30, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఐదుగురు వలసదారులకు డ్రగ్స్ కేసులో శిక్షలు విధించింది. ఇందులో ముఠా నాయకుడికి మరణ శిక్ష విధించింది. నలుగురు నిందితులు 120 కిలోల హాషిస్ మరియు ఓపియమ్ డ్రగ్స్ని స్మగుల్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితుడికి 500,000 ఖతారీ రియాల్స్ జరీమానా అలాగే మరణ శిక్ష విధించింది. రెండో నిందితుడికి జరీమానా 500,000 ఖతారీ రియాల్స్ అలాగే జీవిత ఖైదు విధించింది. ఇదే శిక్ష మూడో నిందితుడికి కూడా విధించారు. నాలుగో వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించగా, ఐదో నిందితుడికి ఏడాది జైలు, 10,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించారు. డ్రగ్స్ సేవించిన కేసులో ఇతనికి ఈ శిక్ష పడింది. స్మగ్లింగ్ కేసు నుంచి ఇతనికి ఊరట లభించింది.
తాజా వార్తలు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!







