ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ వీరే....
- January 04, 2017
సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. దోపిడీదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుల్బర్గా వరకు స్కార్పియో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులకు అక్కడ లింక్ తెగిపోయింది. అయితే రామచంద్రాపురం నుంచి శంకర్ పల్లి మీదుగా గుల్బర్గా వెళ్లినట్లు మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ క్లూ ఆధారంగా గుల్బర్గా వరకున్న సెల్ టవర్ల పరిధిలోని కాల్స్ను ట్రేస్ చేశారు. ఎక్కువగా కాల్స్ వెళ్లిన నెంబర్ల ఆధారంగా ఆరా తీశారు. మరోవైపు వారు వాడిన టిఫిన్ బాక్సులపై వేలి ముద్రలను గుర్తించారు. ఆ వేలి ముద్రలను ఆధార్ రికార్డుల్లో పరిశీలించగా అసలు విషయం బయటపడినట్లు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి విస్తృతంగా గాలించారు. తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్కు తరలించారు. వీరిని ప్రస్తుతం సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







