శుక్ర, గురు గ్రహయానంపై కన్నేసిన ఇస్రో
- January 04, 2017
హాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం కన్నా తక్కువ ఖర్చుతో 'మంగళ్యాన్'ను ప్రాజెక్టును విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంఘం (ఇస్రో) శుక్ర, గురు గ్రహయానంపై కన్నేసింది. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్లో ఇస్రో సహాయక సంచాలకులు ఎం.నాగేశ్వరరావు ఈ విషయం వెల్లడించారు. 'మేం ఇతర గ్రహాలపై పరిశోధనలు చేపట్టాలనుకుంటున్నాం. అందులో రెండు గ్రహాలు శుక్రుడు, గురుడు. ఈ యాత్రలకు అవసరమైన వాహక నౌకలు, ఉపగ్రహాల రూపకల్పనపై విశ్లేషిస్తున్నాం. ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం కావడానికి మరికొన్నేళ్లు పడుతుందని' అన్నారు. భూమి నుంచి దూరం, స్థితి (పొజిషన్)ని బట్టి శుక్రుడిపైకి ఉపగ్రహం పంపేందుకు 19 నెలలకు ఒకసారి అవకాశం వస్తుందన్నారు. పృథ్వీ మండలం నుంచి శుక్రుడు 162 మిలియన్ మైళ్లు, గురుడు 610 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నారు. మంగళ్యాన్-2, చంద్రయాన్-2 యాత్రల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ సారి చంద్రుడిపైకి రోవర్, ల్యాండర్ను పంపిస్తామని నాగేశ్వరరావు అన్నారు. వచ్చే ఏడాది చంద్రయాన్-2 యాత్ర చేపట్టే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







