త్వరలో రానున్న ప్యాసింజర్‌ డ్రోన్‌.!

- January 04, 2017 , by Maagulf
త్వరలో రానున్న ప్యాసింజర్‌ డ్రోన్‌.!

డ్రోన్‌కార్లు​ కొన్నేళ్లలోనే మార్కెట్లలోకి రానున్నాయి. దాదాపు 1,500 కిలోల బరువుండే ఈ ప్యాసింజర్‌ డ్రోన్‌ 2020 నాటికి మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ కంపెనీ దీనిని రూపొందించింది. ఇది దాదాపు 500 కిలోల బరువును తీసుకొని 185 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలువ సుమారు రూ.950కోట్లు ఉండవచ్చు. ఇజ్రాయిల్‌లోని అర్బన్‌ ఏరోనాటిక్స్‌ అనే సంస్థ దీనిని తయారు చేస్తోంది. 'ఒక్కసారి వూహించుకోండి.. ఏదైనా విషవాయువులు మీ పట్టణంలో లీకైతే.. ఆటోమేటిక్‌ డ్రోన్‌ వచ్చి ప్రజలను రక్షిస్తే ఎలా ఉంటుందో' అని అర్బన్‌ ఏరోనాటిక్స్‌ సీఈవో రాఫి యోలీ తెలిపారు. జనావాసాల మధ్య సురక్షితంగా ప్రయాణించే డ్రోన్‌లను తయారు చేసేందుకు 2001లో ఈ సంస్థను సెంట్రల్‌ ఇజ్రాయిల్‌లో స్థాపించారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన కొంత పని పూర్తికావాల్సి ఉంది. 'ఎయిర్‌ మ్యూల్‌' గా వ్యవహరించే ఈ డ్రోన్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రమాణాలను ఇంకా అందుకోవాల్సి ఉంది. దీనిపేరుతో ఇప్పటికే 39 పేటెంట్లు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com