జీఆర్ఈఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి
- January 08, 2017
అక్నూర్: జమ్ములోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో మారుణహోమానికి తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని.. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
ఇటీవల కాలంలో జమ్ము-కశ్మీర్లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







