వాహనదారులకు శుభవార్త....

- January 08, 2017 , by Maagulf
వాహనదారులకు శుభవార్త....


హైదరాబాద్: జనవరి 13 వరకు తమ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్లు పెట్రో డీలర్లు ప్రకటించారు. బ్యాంకులు తమకు చార్జీలు వేస్తున్నాయన్న ఆందోళనతో నేటి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకోబోమన్న పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చార్జీల నిర్ణయాన్ని 13 వరకు వాయిదావేసుకున్నారు. అప్పటివరకు కార్డులతో పెట్రోలు అమ్మకానికి ఒప్పుకున్నారు. బంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా పెట్రోలు అమ్మకం జరిపితే 1 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తామని బ్యాంకులు చెప్పడంతో.. ఆదివారం అర్ధరాత్రి నుంచి కార్డులు అంగీకరించకూడదని పెట్రోల్ డీలర్ల అసోషియేషన్ నిర్ణయించింది. చార్జీ వసూలు బ్యాంకులు హఠాత్తుగా తీసుకున్న అక్రమ నిర్ణయమని పెట్రోల్ బ్యాంక్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకులు విధించాలనుకున్న ఈ కొత్త చార్జీ భారమంతా తమపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బ్యాంకులు చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేయడంతో పెట్రో డీలర్లు వెనక్కి తగ్గారు. వారు కార్డుల వినియోగంపై 13 వరకు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com