వాహనదారులకు శుభవార్త....
- January 08, 2017
హైదరాబాద్: జనవరి 13 వరకు తమ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్లు పెట్రో డీలర్లు ప్రకటించారు. బ్యాంకులు తమకు చార్జీలు వేస్తున్నాయన్న ఆందోళనతో నేటి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకోబోమన్న పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చార్జీల నిర్ణయాన్ని 13 వరకు వాయిదావేసుకున్నారు. అప్పటివరకు కార్డులతో పెట్రోలు అమ్మకానికి ఒప్పుకున్నారు. బంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా పెట్రోలు అమ్మకం జరిపితే 1 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తామని బ్యాంకులు చెప్పడంతో.. ఆదివారం అర్ధరాత్రి నుంచి కార్డులు అంగీకరించకూడదని పెట్రోల్ డీలర్ల అసోషియేషన్ నిర్ణయించింది. చార్జీ వసూలు బ్యాంకులు హఠాత్తుగా తీసుకున్న అక్రమ నిర్ణయమని పెట్రోల్ బ్యాంక్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకులు విధించాలనుకున్న ఈ కొత్త చార్జీ భారమంతా తమపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బ్యాంకులు చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేయడంతో పెట్రో డీలర్లు వెనక్కి తగ్గారు. వారు కార్డుల వినియోగంపై 13 వరకు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







