జెరూసలేంలో ట్రక్కు బీభత్సం...

- January 08, 2017 , by Maagulf
జెరూసలేంలో ట్రక్కు బీభత్సం...

- నలుగురు మృతి, 13 మందికి గాయాలు 
జెరూసలేం : ఇజ్రాయెల్‌ రాజధాని జెరూసలేంలో ఆదివారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ ట్రక్కును జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్టు పోలీస్‌ అధికార ప్రతినిధి రోసెన్‌ఫెల్డ్‌ తెలిపారు. ఘటనాస్థలి వద్ద అప్పటికే ఉన్న సైనికులపై కూడా ట్రక్కును తీసుకెళ్లేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. దీంతో, అప్రమత్తమైన సైనికులు ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు రోసెన్‌ఫెల్డ్‌ తెలిపారు. జెరూసలేం మేయర్‌ నిర్‌ బర్కత్‌ ఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించుకోలేదు.
ఈ దాడికి పాల్పడ్డ వారిని ప్రశంసిస్తున్నట్టు హమాస్‌ ఉగ్రసంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్‌ లతీఫ్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com