జెరూసలేంలో ట్రక్కు బీభత్సం...
- January 08, 2017
- నలుగురు మృతి, 13 మందికి గాయాలు
జెరూసలేం : ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో ఆదివారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ట్రక్కును జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్టు పోలీస్ అధికార ప్రతినిధి రోసెన్ఫెల్డ్ తెలిపారు. ఘటనాస్థలి వద్ద అప్పటికే ఉన్న సైనికులపై కూడా ట్రక్కును తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో, అప్రమత్తమైన సైనికులు ట్రక్కు డ్రైవర్ను కాల్చి చంపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు రోసెన్ఫెల్డ్ తెలిపారు. జెరూసలేం మేయర్ నిర్ బర్కత్ ఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించుకోలేదు.
ఈ దాడికి పాల్పడ్డ వారిని ప్రశంసిస్తున్నట్టు హమాస్ ఉగ్రసంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







