పాకిస్థాన్ సరిహద్దును మూసివేయనున్న చైనా
- January 11, 2017
అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్తాన్ సరిహద్దు పొడవునా భద్రత కట్టుదిట్టం చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు జిన్జియాంగ్ ప్రభుత్వం వెల్లడించినట్టు అక్కడి అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేయడంలో పాకిస్తాన్ విఫలం కావడంపై చైనా ఎంత అసహనంతో ఉందో తాజా పరిణామాలు చెప్పనే చెబుతున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో శిక్షణ తీసుకున్న తీవ్రవాదులు ఇక్కడికి తిరిగి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు జిన్జియాంగ్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జిన్జియాంగ్లోని హోటన్లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా మరో నాలుగు దేశాలతో జిన్జియాంగ్ సరిహద్దు పంచుకుంటోంది. హోటన్లో డిసెంబర్ 28న ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఐదుగురు పౌరులు మృతిచెందారు. దీంతో అక్కడి సైన్యం ఆదివారం తమకు లొంగకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







