సమస్యల పరిష్కారం జస్ట్ ఓ క్లిక్తో
- January 15, 2017
మనామా: భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీ సహాయం కోరడం ఇకపై చాలా సులువు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, వ్యక్తిగతంగా ట్విట్టర్ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్, బహ్రెయిన్ అధికారిక పర్యటనలో భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ఇండియన్ ఎంబసీ లేదా అథారిటీకి తమ సమస్యల్ని ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, అలాగే ఆ ఫిర్యాదుని తన ట్విట్టర్ అకౌంట్కి కూడా పంపవచ్చనీ, తద్వారా ఆ ఫిర్యాదుల్ని తాము పరిశీలిస్తామని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఇంకో వైపున, ఎంబసీ పూర్తిస్థాయిలో భారతీయ వలసదారుల సమస్యలను పరిష్కరించడానికి సర్వసన్నద్ధంగా ఉందని వికె సింగ్ చెప్పారు. గడచిన రెండున్నరేళ్ళలో విదేశీ వ్యవహారాల శాఖ, విదేశాల్లో సమస్యలతో సతమతమవుతున్న భారతీయుల పట్ల మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికే సుష్మాస్వరాజ్ కొందరు భారతీయ వలసదారుల సమస్యల పట్ల వ్యక్తిగతంగా స్పందించారు. అలాగే వికె సింగ్ కూడా తనదైన చొరవ ప్రదర్శిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతున్నందుకు బాధితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉండగా, భారతీయుల నరనరాల్లోనూ కష్టించే తత్వం జీర్ణించుకుపోయిందనీ, అందుకే వారు ఏ దేశానికి వెళ్ళినా అక్కడి అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారనీ, అయితే కొన్ని సమస్యల కారణంగా వారు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఆ సమస్యల్ని పరిష్కరించడమే తమ లక్ష్యమని వికె సింగ్ చెప్పారు. భారతదేశ అభివృద్ధిలోనూ ఎన్ఆర్ఐలు కీలక భూమిక పోషిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







