అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్
- January 15, 2017
టీ-20 అంధుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ అమరావతి పరిధిలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక కమిటీ ఉన్నతాధికారిణి, భారతదేశ అంధుల క్రికెట్ బోర్డు సభ్యురాలు జహారబేగం తెలిపారు. తెనాలిలోని గాంధీ వృద్ధాశ్రమాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు టోర్నీ ఉంటుందని, విజయవాడ-గుంటూరుల్లో నిర్వహించటానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేసి, దుస్తులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







