నైజీరియా యూనివర్శిటీలో బాంబు పేలుళ్లు

- January 16, 2017 , by Maagulf
నైజీరియా యూనివర్శిటీలో బాంబు పేలుళ్లు

నైజీరియాలోని నార్ట్‌ఈస్ట్రన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మైదుగురిలో సంభవించిన రెండు వరుస బాంబు పేళుల్లో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యూనివర్శిటీ వద్ద గల మసీదులో, కాలేజి గేటు వద్ద వెంట వెంటనే పేలుళ్లు సంభవించాయని ఈ సంఘటనలో ఒక ప్రొఫెసర్‌తో సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. 15 మంది దాకా గాయపడ్డారని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆత్మహుతి దాడికి పాల్పడ్డారా లేక బాంబులు పెట్టారా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com