ఫేస్బుక్, వాట్సాప్లకు నోటీసులు
- January 16, 2017
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు అయిన వాట్సాప్, ఫేస్బుక్ లలో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), ఫేస్బుక్,వాట్సా ప్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు దేశంలోని 15 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యత లేకుండా చేస్తున్నాయంటూ దాఖలైనపిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ సామా జిక మాధ్యమాలు ఆర్టికల్19, 21 ప్రకారంరాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొ న్నారు. అనంతరం దీనిపై వివరణ ఇవ్వా లంటూ కేంద్రం, ట్రాయ్, ఫేస్బుక్, వాట్సాప్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్ విషయంలోఅటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహాయాన్ని ధర్మాసనం కోరింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







