భూకంపం ఇటలీలో...
- January 18, 2017
- రిక్టర్స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు
రోమ్ : మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 5.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. అమాట్రీస్ నగరానికి 7కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. భూకంప ప్రభావంతో అబ్రూజో, మార్చే, లాజియో, రోమ్ నగరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అన్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టులో అమాట్రీస్ నగరంలో భారీ భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ దుర్ఘటలో 297 మంది మృతి చెందారు.
జపాన్లోనూ...
సెంట్రల్ జపాన్లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 4.2గా నమోదైందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇబారకీ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







