పాన్ తప్పదు రూ.30,000 లావాదేవీలకు...
- January 20, 2017
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఇందుకోసం మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇందులో భాగంగా రూ.30,000 లేదా అంతకు మించి నగదు లావాదేవీ జరిపితే పాన్ నెంబర్ కోట్ చేయడాన్ని తప్పనిసరి చే యాలని యోచిస్తోంది. ప్రస్తు తం రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిపినప్పుడు తప్పనిసరిగా పాన్ నెంబర్ను వెల్లడించాలన్న నిబంధన అమల్లో ఉంది. వచ్చే బడ్జెట్లో ఈ పరిమితిని రూ.30 వేలకు కుదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. 'వీటికి తోడు ఒక పరిమితికి మించి చేసే నగదు లావాదేవీలపై 'నగదు నిర్వహణ' చార్జీలు వసూలు చేయాలని కూడా యోచిస్తోంది' అని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఏదైనా వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపు రూ.2 లక్షలు లేదా అంతకు మించితే పాన్ నెంబర్ కోట్ చేయాలి. వచ్చే బడ్జెట్లో దీన్ని రూ.లక్షకు కుదించే అవకాశం ఉందని సమాచారం. కాగా ప్రస్తుతం ఎటిఎం నుం చి నెలకు ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు నిర్వహించే సదుపాయం ఉంది. దీన్ని మూడుకు తగ్గించే అవకాశం ఉంది.
రూ.10 లక్షలున్నా చెప్పాల్సిందే.. బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లు, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపైనా ఆదాయ పన్ను శాఖ నిఘా పెట్టింది. ఖాతాదారుడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్లు ఏడాది కాలంలో రూ.10 లక్షలకు చేరితే బ్యాంకులు ఆ విషయాన్ని ఐటి శాఖకు తెలపాలని సిబిడిటి కోరింది. క్రెడిట్ కార్డు బిల్లులు, నగదు చెల్లింపులు రూ.లక్ష దాటినా ఆ వివరాలను ఐటి శాఖకు వెల్లడించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









