తృటిలో తప్పిన పెను ప్రమాదం...
- January 28, 2017
- నిండా పెట్రోలియం ఉత్పత్తులతో రెండు నౌకలు ఢీ
- అప్రమత్తమైన అధికారులు.. హెలికాప్టర్తో సర్వే
చెన్నై: నిండా పెట్రోలియం ఉత్పత్తులను నింపుకొని ప్రయాణిస్తోన్న రెండు రవాణా నౌకలు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. చెన్నైలోని కామరాజార్ పోర్టుకు అతిసమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లోడుతో పోర్ట్ నుంచి బయటికి వెళుతోన్న ఎం.టి.బీడబ్ల్యూ. మేపిల్ రవాణా నౌక.. ఎదురుగా వచ్చిన ఎం.టి.డాన్ అనే నౌకను ఢీకొట్టిందని, డాన్ నౌక నిండా పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స(పీఓఎల్) ఉన్నాయని కామరాజార్ పోర్ట్ అథారిటీ చైర్మన్, ఎండీ ఎం.ఏ. భాస్కరాచార్ మీడియాకు తెలిపారు.
ఒకవేళ పెట్రోల్ ఉత్పత్తులు లీకై ఉంటేగనుక తీరంలో పెను ఉపద్రవం సంభవించిఉండేది. వందలాది సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఉండేది. అయితే అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేదీ జరగలేదని పోర్ట్ ఎండీ భాస్కరాచార్ స్పష్టం చేశారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే సహాయక సిబ్బందిని పంపామని, రెండు నౌకలను తీరానికి తీసుకొచ్చి క్షుణ్నంగా పరిశీలించామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో నౌకలు ధ్వంసం కావడంగానీ, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంగానీ, ఆయిల్ లేదా గ్యాస్ లీకేజీకానీ జరగలేదని పేర్కొన్నారు. కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్ సైతం ఆ ప్రాంతంలో సర్వే చేసిందని చెప్పారు.
ప్రస్తుతానికి పరిస్థితి తమ అదుపులోనే ఉందని కామరాజార్ పోర్టు ఎండీ తెలిపారు. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. కాగా, ఎం.టి.డాన్ నౌకలోని పెట్రోలియం ఉత్పత్తులను అధికారులు అన్లోడ్ చేయించారు. మేపిల్ నౌక మాత్రం యధావిధిగా తన మజిలీకి బయలుదేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







