కొత్త సంప్రదాయానికి నాంది : ప్రధాని మోదీ..
- January 31, 2017
''ఈరోజు ఓ కొత్త సంప్రదాయం ప్రారంభమవుతోంది. మొదటిది, దాదాపు ఒక నెల ముందుగానే బడ్జెట్ వస్తోంది. రెండోది, రైల్వే బడ్జెట్ దీనిలో చేరింది. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. వీటి ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆయన మాట్లాడారు. బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేదని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఆ సంప్రదాయానికి తెరపడిందని చెప్పారు. ప్రస్తుత సమావేశాలు ప్రయోజనాత్మకంగా జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







