ఆందోళనకరంగా మరణాలు కరాచీ జైల్లో ...!
- February 10, 2017
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ నగరంలోని జైల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న 'సహజ మరణాలు' అక్కడ పౌరహక్కుల సంఘాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ జైల్లో వినియోగిస్తున్న ఔషధాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాక్ ప్రభుత్వం స్పందించింది. జైల్లో వినియోగిస్తున్న సుమారు 26రకాల ఔషధాల నమూనాలను నిన్న సేకరించింది. గత ఆరువారాల్లో ఏడుగురు వ్యక్తులు వైరస్ ఇన్ఫెక్షన్లతో మృతి చెందారు. దీంతో జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆధ్వర్యంలో అధికారులు ఈ జైలును సందర్శించారు. అక్కడ ముందుల నమూనాలను సేకరించారు. దీనిపై ఐజీ నుస్రత్ మంజాన్ మాట్లాడుతూ ఇటీవల చలిగాలుల కారణంగా జైల్లో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న ఖైదీలకు నాసిరకమైన ముందులు వాడటం వల్ల మరణాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







