ఆందోళనకరంగా మరణాలు కరాచీ జైల్లో ...!

- February 10, 2017 , by Maagulf
ఆందోళనకరంగా మరణాలు కరాచీ జైల్లో ...!

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని జైల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న 'సహజ మరణాలు' అక్కడ పౌరహక్కుల సంఘాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ జైల్లో వినియోగిస్తున్న ఔషధాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాక్‌ ప్రభుత్వం స్పందించింది. జైల్లో వినియోగిస్తున్న సుమారు 26రకాల ఔషధాల నమూనాలను నిన్న సేకరించింది. గత ఆరువారాల్లో ఏడుగురు వ్యక్తులు వైరస్‌ ఇన్ఫెక్షన్లతో మృతి చెందారు. దీంతో జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి ఆధ్వర్యంలో అధికారులు ఈ జైలును సందర్శించారు. అక్కడ ముందుల నమూనాలను సేకరించారు. దీనిపై ఐజీ నుస్రత్‌ మంజాన్‌ మాట్లాడుతూ ఇటీవల చలిగాలుల కారణంగా జైల్లో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న ఖైదీలకు నాసిరకమైన ముందులు వాడటం వల్ల మరణాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com