బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ జోష్ లో...
- February 15, 2017
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనందానికి అవదుల్లేకుండా పోయాయి. ట్విటర్ ఖాతాలో ఆయన ఓ మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తన ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నారు 'బిగ్ బి' అమితాబ్. తన ట్విట్టర్ అకౌంట్లో 25 మిలియన్ల ఫాలోయర్స్ మార్క్ ను చేరుకున్నారు. 'నేను ఈ విషయాన్ని గమనించడం మరిచిపోయాను. 25 మిలియన్లు.. యేహా (మై తో దేఖ్నా బుల్ హి గయా.. 25 మిలియన్లు.. యేహా 25 మిలియన్లు)' అని ట్వీట్ లో రాసుకొచ్చారు అమితాబ్. రెండున్నర కోట్ల ట్విట్టర్ ఫాలోయర్స్ తో అమితాబ్ దూసుకుపోతున్నారు.
కొందరు ప్రముఖుల ట్విట్లర్ ఫాలోయర్లను గమనించినట్లయితే.. ప్రధాని నరేంద్ర మోదీ 2.71 కోట్ల మంది ఫాలోయర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులలో అమితాబ్ 2.5 కోట్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నారు. షారుక్ ఖాన్ 2.34 కోట్లు, సల్మాన్ ఖాన్ 2.15 కోట్లు, దీపికా పదుకొనే17.4 కోట్లు, ప్రియాంక చోప్రా 16.3 కోట్ల ఫాలోయర్స్ తో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 13.9 కోట్ల మంది ఫాలో అవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







