పాకిస్తాన్లోని లాహోర్ బాంబులతో దద్దరిల్లింది...
- February 15, 2017పాకిస్తాన్లోని లాహోర్ బాంబులతో దద్దరిల్లింది. సోమవారం సాయిత్రం పంజాబ్ అసెంబ్లీ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది. లాహోర్ నగరంలోని పంజాబ్ అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 16 మంది మరణించగా దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పంజాబ్ ఆరోగ్య శాఖా మంత్రి సల్మాన్ రఫీక్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో లాహోర్ ట్రాఫిక్ పోలీసు చీఫ్ అహ్మద్ మొబీన్, సీనియర్ ఎస్పీ జహీద్ ఉన్నారని లాహోర్ పోలీస్ కమీషనర్ అమిన్ వైన్స్ చెప్పారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ పార్మా స్యూటికల్స్ తయారీదారులు ఆందోలన నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆందోళనకారులతో చర్చించేందుకు ట్రాఫిక్ పోలీసు చీఫ్ మొబీన్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మోటర్ బైక్పై వచ్చిన దుండగుడు తన వాహనాన్ని పోలీసు అధికారుల సమీపంలోకి తీసుకెళ్ళి పేల్చేసుకున్నాడు. నిఘా సంఘాలు ముందే హెచ్చరించినా పేలుడును అడ్డుకోలేకపోయామని, ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదం తప్పి వుండేదని పంజాబ్ న్యాయ శాఖా మంత్రి రానా సనుల్లాహ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం