3 లక్షలమంది ఎన్నారైలను వెనక్కి పంపేయనున్న అమెరికా ప్రభుత్వం
- February 23, 2017
అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అక్కడున్న ఎన్నారైల్లో టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన అధికారులు తమను భారత్కి పంపిస్తారేమోనన్న భయం వాళ్లను అనుక్షణం వెంటాడుతోంది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగేశారు. ఎంతమంది అక్రమంగా వుంటున్నారన్న దానిపై లెక్కలు తీస్తే వివిధ దేశాలకు చెందినవాళ్లు దాదాపు 11 మిలియన్ల మంది వున్నట్లు తేలింది. అందులో 3 లక్షలమంది ఇండో- అమెరికన్లు వున్నట్లు సమాచారం. వీళ్లందరిపైనా ఆ ప్రభావం పడనుంది. ఎన్నో ఏళ్లుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తమను హఠాత్తుగా పొమ్మనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వలసదారులను పంపించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గట్టిగా నిర్ణయించుకుంది. ఒకవేళ ఇమిగ్రెంట్ చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారులు భావిస్తే వాళ్లని అరెస్టు చేసే అదుపులోకి తీసుకునే సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. మరోవైపు అమెరికా భద్రతా విభాగం ఇప్పటికే రెండు మెమోలను జారీ చేసింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







