ఐసిస్ ఘాతుకం.. 42 మంది మృతి

- February 24, 2017 , by Maagulf
ఐసిస్ ఘాతుకం.. 42 మంది మృతి

సిరియాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరియాకు ఉత్తరాన ఉన్న అల్‌ బాబ్‌ నగరంలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో 42 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఫ్రీ సిరియన్‌ ఆర్మీ సెక్యూరిటీ చెక్‌పోస్టును ఐసిస్ తీవ్రవాదులు కారు బాంబుతో ఢీకొట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆపరేషన్‌ యూప్రేటెస్‌ హ్యుమన్‌ రైట్స్‌ సంస్థ తెలిపింది.
ఇస్లామిక్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా టర్కిష్‌ సేనలు ఆపరేషన్‌ను ప్రారంభించిన నాటి నుంచి సుమారు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టర్కిష్‌ దళాలకు మద్దతుగా యూఫ్రటీస్‌ సంస్థ దాడులు జరిపిస్తుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com