అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు

- February 25, 2017 , by Maagulf
అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆయన ట్రంప్‌ను కలిసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఒక అత్యున్నత భారతీయ అధికారి ట్రంప్‌ను కలవడం ఇదే ప్రథమం. 1980 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన సర్నా అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమెరికా చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన యూకేలో భారతీయ హైకమిషనర్‌గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు నిన్న రాయబారులు అందరూ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వీరిలో సర్నా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు. నిన్న జాతీయ గవర్నర్లకు ట్రంప్‌ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి 25 రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com