అమెరికాలో భారతీయల రాయబారి నవ్తేజ్ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు
- February 25, 2017
వాషింగ్టన్: అమెరికాలో భారతీయల రాయబారి నవ్తేజ్ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆయన ట్రంప్ను కలిసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఒక అత్యున్నత భారతీయ అధికారి ట్రంప్ను కలవడం ఇదే ప్రథమం. 1980 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సర్నా అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమెరికా చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన యూకేలో భారతీయ హైకమిషనర్గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు నిన్న రాయబారులు అందరూ ట్రంప్తో భేటీ అయ్యారు. వీరిలో సర్నా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు. నిన్న జాతీయ గవర్నర్లకు ట్రంప్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి 25 రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







