తగ్గిన పసిడి ధర
- September 22, 2015
బంగారం ధర వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.150 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.26,510కి చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,133.40 అమెరికన్ డాలర్లుగా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం వల్ల ఈ లోహం ధర దేశీయంగా తగ్గుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఈ రోజు వెండి ధరలు తగ్గి రూ.36,000 మార్కు దిగువకు చేరుకున్నాయి. రూ.170 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.35,830కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో డిమాండు తగ్గిందని దీంతో ఈ లోహం ధర తగ్గుముఖం పట్టిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







