అనుమానాస్పద స్థితిలో సౌదీలో తెలంగాణ యువకుడి మృతి
- March 01, 2017
మెరుగైన జీవనం కోసం విదేశాల బాటపట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాకు చెందిన శ్రీనివాస్(26) మూడున్నరేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. ఓ పాఠశాలలో బస్సు డ్రైవర్గా చేరాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ వాహనాన్ని వారం రోజుల క్రితం మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ను సౌదీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఉన్న శ్రీనివాస్ మూడు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, గురువారం ఉదయం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సౌదీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులే తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు నిజా నిజాలు తెలుసుకోవడానికి యత్నించాలని మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







