అనుమానాస్పద స్థితిలో సౌదీలో తెలంగాణ యువకుడి మృతి
- March 01, 2017
మెరుగైన జీవనం కోసం విదేశాల బాటపట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాకు చెందిన శ్రీనివాస్(26) మూడున్నరేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. ఓ పాఠశాలలో బస్సు డ్రైవర్గా చేరాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ వాహనాన్ని వారం రోజుల క్రితం మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ను సౌదీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఉన్న శ్రీనివాస్ మూడు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, గురువారం ఉదయం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సౌదీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులే తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు నిజా నిజాలు తెలుసుకోవడానికి యత్నించాలని మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









