భట్కి చంపేస్తామంటూ బెదిరింపులు
- March 02, 2017
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియాభట్ కుటుంబాన్ని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఆలియాభట్ తండ్రి, నిర్మాత మహేశ్ భట్కు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో ఆయనను, కుమార్తె ఆలియాభట్ను, భార్య సోని రజ్దాన్ను చంపేస్తామని బెదిరించాడు. మహేశ్ భట్ కుటుంబం ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తర్వాత ముంబయి పోలీస్ యాంటీ ఎక్స్టోర్షన్ సెల్(ఏఎన్సీ)కు అప్పగించారు. వీరు పోలీసు శాఖతో కలిసి కేసు విచారణ జరపనున్నారు.
ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి మహేశ్భట్కు ఫోన్ చేసి రూ.
50 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తొలుత ఈ బెదిరింపులను ఆయన సీరియస్గా తీసుకోలేదని, ఎవరో ఆకతాయిలు చేస్తున్న పనిగా భావించారన్నారు. కానీ మళ్లీ అటువైపునుంచి వాట్సాప్ సందేశాల ద్వారా హెచ్చరికలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తాము కోరిన మొత్తం నగదును లఖ్నవూకి చెందిన బ్యాంకులో డిపాజిట్ చేయమని మహేశ్ భట్కు చెప్పారన్నారు.
లేనిఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారన్నారు. ఫిబ్రవరి 26న రాత్రి ఈ ఘటన జరిగిందని, కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ఆయన జుహు ప్రాంత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 387 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని, మహేష్ కుటుంబానికి భద్రత పెంచినట్లు తెలిపారు. భట్ కుటుంబానికి ఇలా బెదిరింపులు రావడం ఇది రెండోసారి.
వీరి కుటుంబాన్ని బెదిరించిన 13 మందితో కూడిన ఒక గ్యాంగ్ను 2014 నవంబర్లో పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







