సిరియా రాజధానిలో బాంబు పేలుళ్లు
- March 12, 2017- 44 మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్లోని ఓల్డ్ సిటీలో శనివారం రెండు చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఒక చోట మందుపాతర పేలిందని, మరో చోట ఆత్మాహుతి దాడి జరిగిందని, ఈ రెండు ఘటనల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారని సిరియాలోని మానవ హక్కుల పర్యవేక్షణ ఏజెన్సీ ఒకటి మీడియాకు తెలిపింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ సైన్యం ఆధీనంలో ఉన్న డమాస్కస్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అయినప్పటికీ బాంబు పేలుళ్లు చోటుచేసుకోవటం సర్వత్రా ఆందోళన రేపింది.
బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలిందని, బాబ్ అల్ సాఘర్ అనే ప్రాంతంలో ఒక దుండగుడు తనను తాను పేల్చుకున్నాడని స్థానిక మీడియా వార్తల్ని ప్రసారం చేసింది.
బాబ్ అల్ సాఘర్లో షియాలకు చెందిన ప్రఖ్యాత మ్యూజియం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని, మృతుల్లో ఎక్కువగా షియా వర్గం వారే ఉన్నారని స్థానిక పోలీసులు చెప్పారు. రెండు చోట్ల జరిగిన బాంబుదాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని, మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ చీఫ్ రామీ అబ్దెల్ రహమాన్ 'ఎఎఫ్పీ' మీడియాతో చెప్పారు.
రాజధాని డమాస్కస్లో రెండు చోట్ల బాంబు దాడులు జరిగాయని ప్రభుత్వ మీడియా 'సనా' న్యూస్ కూడా తెలియజేసింది. ఇరాక్, సిరియాల్లో అల్ఖైదా, దాని అనుబంధ సంస్థలు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ముఖ్యంగా షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరుపుతున్నారు. ఇటీవల ఈ దాడుల తీవ్రత పెరిగింది. తాజా దాడులు తమ పనేనని అల్ఖైదా అనుబంధ సంస్థ ఫతే అల్ షామ్ ప్రకటించుకుంది.
రష్యా, సిరియా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశామని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!