తన గురువు కోరికను తీర్చనున్న మోడీ

- March 15, 2017 , by Maagulf
తన  గురువు కోరికను తీర్చనున్న మోడీ

భారత ప్రధాని కావాలన్న కోరిక ఎటూ నెరవేరలేదు. దేశ తొలిపౌరుడయ్యే చాన్స్‌ అయినా ఇచ్చి తన గురువు కోరిక నెరవేర్చడానికి మోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. మోదీ ఈ నెల 8న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయన్ని సందర్శించారు. అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారి మధ్య రాష్ట్రపతి ప్రస్తావన వచ్చిందని, సోమనాథుడి సాక్షిగా ఆడ్వాణీని రాష్ట్రపతిగా చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని సమాచారం.
ఇప్పుడు యూపీలో 325 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్రపతిగా తనకు నచ్చిన వ్యక్తినే చేసే అవకాశం మోదీకి దక్కింది.
వాస్తవానికి బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు. అయినా దీనికి తోడు 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ, మోదీ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవి ఇస్తామని అప్పట్లో అద్వానీకి హామీ ఇచ్చి బుజ్జగించారు. పార్లమెంటులో కేవలం రెండు స్థానాలున్న
బీజేపీని 200 స్థానాలకు పైగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహించిన ఆడ్వాణీకి దేశ అత్యున్నతపదవి ఇచ్చి సముచితంగా గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో అగ్రనేత ఆడ్వాణీ ఈ ఏడాది జూలైలో రైజినా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్‌లోకి అడుగు పెట్టబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో తన ఎదుగుదలకు నిరంతరం సాయం చేసిన ఆడ్వాణీ పట్ల కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని మోదీ తన అనుయాయుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com