తన గురువు కోరికను తీర్చనున్న మోడీ
- March 15, 2017
భారత ప్రధాని కావాలన్న కోరిక ఎటూ నెరవేరలేదు. దేశ తొలిపౌరుడయ్యే చాన్స్ అయినా ఇచ్చి తన గురువు కోరిక నెరవేర్చడానికి మోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. మోదీ ఈ నెల 8న గుజరాత్లోని సోమనాథ్ ఆలయన్ని సందర్శించారు. అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారి మధ్య రాష్ట్రపతి ప్రస్తావన వచ్చిందని, సోమనాథుడి సాక్షిగా ఆడ్వాణీని రాష్ట్రపతిగా చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని సమాచారం.
ఇప్పుడు యూపీలో 325 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్రపతిగా తనకు నచ్చిన వ్యక్తినే చేసే అవకాశం మోదీకి దక్కింది.
వాస్తవానికి బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు. అయినా దీనికి తోడు 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ, మోదీ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవి ఇస్తామని అప్పట్లో అద్వానీకి హామీ ఇచ్చి బుజ్జగించారు. పార్లమెంటులో కేవలం రెండు స్థానాలున్న
బీజేపీని 200 స్థానాలకు పైగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహించిన ఆడ్వాణీకి దేశ అత్యున్నతపదవి ఇచ్చి సముచితంగా గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో అగ్రనేత ఆడ్వాణీ ఈ ఏడాది జూలైలో రైజినా హిల్స్లోని రాష్ట్రపతి భవన్లోకి అడుగు పెట్టబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో తన ఎదుగుదలకు నిరంతరం సాయం చేసిన ఆడ్వాణీ పట్ల కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని మోదీ తన అనుయాయుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







