సమంత రాజకీయాల్లోకి
- March 15, 2017
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయిన సినీనటి సమంత వరంగల్ జిల్లా గూండాలలో సందడి చేశారు. గుండాల గ్రామంలో పర్యటించి ఇక్కడ తయారయ్యే దోమ తెరల తయారీని పరిశీలించారు. చేనేత రంగ నిపుణులు, అక్కడి కార్మికులతో మాట్లాడారు. దోమ తెరలతోపాటు చీరలను కూడా నేస్తే ఎలాఉంటుంది? గిట్టుబాటు అవుతుందా? అనే విషయాన్ని వారితో చర్చించారు. దాదాపు గంటపాటు చేనేత కార్మికులతో గడిపిన ఆమె, తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
వారంరోజుల క్రితమే సమంత మెదక్ జిల్లా దుబ్బాకలో పర్యటించి అక్కడి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, సమంత గుండాల పర్యటన స్థానికంగా ఆసక్తికర చర్చకు వేదికైంది. ప్రజాసేవ మీద మక్కువ చూపించే సమంత రాజకీయాల్లోకి రాబోతున్నారని వచ్చే ఎన్నికల్లో ఆమె స్టార్ క్యాంపెయినర్ అవ్వబోతున్నారని మాట్లాడుకోవడం కనిపించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







