ఏపీఎన్ఆర్టీ చేయూత కువైట్లో బాధిత మహిళకు
- March 18, 2017
అనారోగ్యంతో కువైట్లోని ఓ ఆస్పత్రిలో మగ్గుతున్న ఆంధ్రా మహిళకు ఏపీ ఎన్ఆర్టీ అండగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త పట్టించుకోకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సుజనా తులసి బతుకుదెరువు కోసం కువైట్ వచ్చి ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంట్లో ఆమెను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భరించలేక పారిపోయి కువైట్లోని ఫర్వానియాలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుంది. తనకు వచ్చిన టైలరింగ్ పనితో జీవనం సాగించేంది. ఓ రోజు ఫర్వానియా నుంచి ఖైతాన్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి, నడుము భాగాల్లో ఫ్యాక్చర్ అయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను సురేష్ అనే ఫాస్టర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఐదు నెలలపాటు ఆమెను కేరళకు చెందిన షైనీ అనే మహిళ అన్ని విధాలా సపర్యలు చేస్తూ భారత్కు పంపేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేయించారు. బాధితురాలు సుజానాపై 800 కువైట్ దినార్లు తీసుకుని పారిపోయిందనే కేసు ఉండటంతో అక్కడి నుంచి రావడానికి ఆటంకం ఏర్పడింది.
ఈ సమస్యని షైనీ కువైట్ ఆంధ్ర టీంకు తెలపడంతో వారు ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు ద్వారా ఏపీఎన్ఆర్టీ సీఈవో వేమూరి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన బాధితురాలిని భారత్కు పంపేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. భారత్లో ఆమె బతుకుదెరువు కోసం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్, ఎన్టీఆర్ ఆరోగ్యసేవా పథకాల ద్వారా తగిన సహాయం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







