మార్చి 21న మ‌ణిర‌త్నం 'చెలియా' ఆడియో

- March 18, 2017 , by Maagulf
మార్చి 21న మ‌ణిర‌త్నం 'చెలియా' ఆడియో

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ, అదితి రావు హైద‌రి ప్రధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం ‘కాట్రు వేళయిదై’. తెలుగులో ఇదే సినిమా ‘చెలియా’ టైటిల్‌తో విడుద‌ల‌వుతోంది. కాగా ఇటీవల ఈ సినిమాకు చెందిన ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 7న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుండ‌గా తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ముందుకు తీసుకువ‌స్తున్నారు. తెలుగులో చిత్ర ఆడియోను మార్చి 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రెహమాన్ అందించిన కొన్ని స్వరాలను ఇప్పటికే విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com