డిజిపికి కెటిఆర్ ట్వీట్ ...చిరు వ్యాపారిపై పోలీస్ జులుం
- March 22, 2017
రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని బ్రతుకు సాగించే చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసుల జులం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మండే ఎండలో రోడ్డుపక్కన పుచ్చకాయలు అమ్ముకుంటున్న వ్యక్తిపై ఉప్పల్ ఇన్స్పెక్టర్ జంగయ్య ఓవరేక్షన్ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటూ బండిమీదున్న పుచ్చకాయల్ని రోడ్డుకేసి కొట్టి బండి తీస్తావా లేదా అంటూ బెదిరించాడు. వారం రోజుల క్రితం ఉప్పల్లోని నల్ల చెరువు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాల్ని రోడ్డుపై అటుగా వెళ్తోన్న వ్యక్తి షూట్ చేసి 'తెలంగాణలో ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్' అని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేశాడు.
దీనిపై కెటిఆర్ స్పందించారు.
'దీనిపై చర్య తీసుకోవాలని, ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి అధికారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలంటూ తెలంగాణ డిజిపి ఖాతాకు కెటిఆర్ రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై తెలంగాణ డిజిపి స్పందించనప్పటికీ, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించి విచారణకు ఆదేశించారు. సంఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ రావును ఆదేశించారు. కెటిఆర్ స్పందనపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కెటిఆర్ ని కీర్తిస్తూ అభినందనలు చెబుతున్నారు. ఇంతకుముందుకూడా కెటిఆర్ ఇలాంటి ఘటనల్ని ఉన్నతాధికారుల దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







