సౌదీ నుండి నిజామాబాద్ కు చేరిన వలసజీవి శవపేటిక
- March 22, 2017
నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం రాంపూర్ కు చెందిన కాశోల్ల దేవేందర్ (26) తేది: 09.03.2017 న సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో గుండెపోటుతో మరణించారు. ఇతని మృతదేహం కలిగిన శవపేటిక తేది: 23.03.2017 న ఉదయం దమ్మామ్ (సౌదీ) నుండి హైదరాబాద్ కు చేరనున్నది. శవపేటికతో పాటు సౌదీ నుండి అదే గ్రామానికి చెందిన కలిగోట్ ప్రదీప్ వస్తున్నారు. కాశోల్ల దేవేందర్ తండ్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేయడానికి తమిళనాడు నుండి 50 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ (తెలంగాణ ప్రవాసి కార్మిక సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షులు బొండల గంగా ప్రసాద్ (మోర్తాడ్ +91 88976 15160) గారి సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి రాంపూర్ వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









