మళ్లీ ఒక్కటి కాబోతున్న సంగీత దిగ్గజాలు బాలు ఇళయరాజా
- March 22, 2017
తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ తెలిపారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఎస్పీబీ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆసందర్భంగా తన ముందస్తు అనుమతి లేకుండా సంగీత కచేరీలలో తన సంగీత దర్శకత్వంలో రూపొందిన సినిమా పాటలను పాడరాదని ఎస్పీబీకి ఇళయరాజా లాయర్ నోటీసు పంపారు. ఆ నోటీసుపై స్పందించిన ఎస్పీబీ ఇకపై తన సంగీత కచేరీలలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన పాటలను పాడనని ప్రకటించారు.
ఇలా ఇరువురి మధ్య మనస్పర్థలు తీవ్రమైన తరుణంలో విశాల్ ఆ ఇరువురు ఒకేవేదికపై సంగీత విభావరిలో పాల్గొంటారని ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరితో మాట్లాడినట్లు విశాల్ తెలిపారు. ఎదేమైనా సంగీత దిగ్గజాలను మళ్లీ ఒక్కటి చేస్తున్నందకు విశాల్ను అభినందించాల్సిందే నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇళయరాజాకు సన్మానసభ జరుపుతామని విశాల్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







