రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్
- March 24, 2017
హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. మేకప్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి తమిళనాడు రైతులకు అండగా ఢిల్లీ నడివీధుల్లో గళమెత్తారు. విపరీతమైన కరువుతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతులకు న్యాయంచేయాలంటూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తోన్న ధర్నాలో ప్రకాష్ రాజ్, విశాల్ పాల్గొన్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. గత వారంరోజులుగా తమిళనాడు రైతుల ఢిల్లీలో తమ రోదనలను వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడకు రావాల్సివచ్చిందని ప్రకాష్ రాజ్, విశాల్ అన్నారు.
తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కరువుతో అల్లాడుతున్న తమిళనాడును ఆదుకోవాలని.. కరువు సహాయకచర్యలు చేపట్టాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ తమిళనాడు రైతులు మెడలో కపాలాలు ధరించి కరువు తీవ్రతను ప్రతిబింబించేలా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







