రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్
- March 24, 2017
హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. మేకప్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి తమిళనాడు రైతులకు అండగా ఢిల్లీ నడివీధుల్లో గళమెత్తారు. విపరీతమైన కరువుతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతులకు న్యాయంచేయాలంటూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తోన్న ధర్నాలో ప్రకాష్ రాజ్, విశాల్ పాల్గొన్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. గత వారంరోజులుగా తమిళనాడు రైతుల ఢిల్లీలో తమ రోదనలను వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడకు రావాల్సివచ్చిందని ప్రకాష్ రాజ్, విశాల్ అన్నారు.
తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కరువుతో అల్లాడుతున్న తమిళనాడును ఆదుకోవాలని.. కరువు సహాయకచర్యలు చేపట్టాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ తమిళనాడు రైతులు మెడలో కపాలాలు ధరించి కరువు తీవ్రతను ప్రతిబింబించేలా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!









