రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్

- March 24, 2017 , by Maagulf
రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్

హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. మేకప్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి తమిళనాడు రైతులకు అండగా ఢిల్లీ నడివీధుల్లో గళమెత్తారు. విపరీతమైన కరువుతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతులకు న్యాయంచేయాలంటూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తోన్న ధర్నాలో ప్రకాష్ రాజ్, విశాల్ పాల్గొన్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. గత వారంరోజులుగా తమిళనాడు రైతుల ఢిల్లీలో తమ రోదనలను వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడకు రావాల్సివచ్చిందని ప్రకాష్ రాజ్, విశాల్ అన్నారు.
తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కరువుతో అల్లాడుతున్న తమిళనాడును ఆదుకోవాలని.. కరువు సహాయకచర్యలు చేపట్టాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ తమిళనాడు రైతులు మెడలో కపాలాలు ధరించి కరువు తీవ్రతను ప్రతిబింబించేలా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com