నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- August 01, 2026
మస్కట్: పాకిస్థాన్లో జరిగిన విషాదకర హిమపాతంలో ఒమాన్కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు నదీరా బింట్ అహ్మద్ అల్ హర్తీ మృతి చెందడంతో ఒమాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నదీరా అల్ హర్తీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పాకిస్థాన్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కాన్సులర్ విభాగం ప్రతినిధి వెల్లడించారు.
నదీరా అల్ హర్తీ ఒమాన్–నేపాల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తూ, ఒమాన్ మరియు నేపాల్ మధ్య మానవతా, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేశారు. రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధం, సహకారం పెంపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు విదేశాంగ శాఖ కొనియాడింది.
సమాజ సేవ, సాంస్కృతిక మార్పిడి, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న మంత్రిత్వ శాఖ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అల్లాహ్ ఆమెకు శాశ్వత శాంతిని ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







