అంగరంగ వైభవంగా ముస్తాబైన జిటెక్స్
- March 29, 2017
జిటెక్స్ షాపర్ స్ప్రింగ్ ఎడిషన్ 2017 అంగరంగ వైభవంగా ముస్తాబై ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ సెకెండ్ వైస్ ఛైర్మన్ ఆఫ్ ది బోర్డ్ - బుటి సయీద్ అల్ ఘాంది ఈ వేడుకిన ప్రారంభించారు. నాలుగు రోజులపాటు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద అద్భుతమైన షాపింగ్ అనుభూతిని షాపింగ్ ప్రియులకు అందించనుంది ఈ జిటెక్స్ షాపర్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బ్రాండ్స్, ఈ షాపింగ్ ఎగ్జిబిషన్లో తమ ప్రోడక్ట్స్ని ప్రదర్శన మరియు అమ్మకానికి ఉంచాయి. అన్ని వర్గాల ప్రజలకూ అనువైన షాపింగ్ ఇక్కడ కొలువుదీరింది. విద్యార్థులు, చిన్న పిల్లలు, మహిళలు ఇలా ఒకరేమిటి, అందరూ ఆనందోత్సాహాలతో షాపింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 300 దిర్హామ్ల మొత్తానికి ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినవారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరించనుంది. ఈ ఏడాది జిటెక్స్ షాపర్ కోసం 20 దిర్హామ్లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







