అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి

- April 30, 2017 , by Maagulf
అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి

ఆప్ఘనిస్థాన్‌పై కొన్నివారాల క్రితం అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కేరళకు చెందిన యాహ్య అనే ఐఎస్ ఉగ్రవాది మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు శనివారం రాత్రి టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చిందని సామాజిక కార్యకర్త రెహమాన్ పేర్కొన్నారు. అష్పక్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అయితే అందులో యాహ్య ఎప్పుడు చనిపోయాడో వెల్లడించలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని పాలక్కడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ధ్రువీకరించలేదు. ముస్లిం మతంలోకి మారిన యాహ్యతోపాటు మరో 21 మంది ఆచూకీ గతేడాది నుంచి లభించలేదు. వీరు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు. కేరళలోని పడ్నా జిల్లాకు చెందిన ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మృతిచెందాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com