అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి
- April 30, 2017
ఆప్ఘనిస్థాన్పై కొన్నివారాల క్రితం అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కేరళకు చెందిన యాహ్య అనే ఐఎస్ ఉగ్రవాది మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు శనివారం రాత్రి టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చిందని సామాజిక కార్యకర్త రెహమాన్ పేర్కొన్నారు. అష్పక్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అయితే అందులో యాహ్య ఎప్పుడు చనిపోయాడో వెల్లడించలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని పాలక్కడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ధ్రువీకరించలేదు. ముస్లిం మతంలోకి మారిన యాహ్యతోపాటు మరో 21 మంది ఆచూకీ గతేడాది నుంచి లభించలేదు. వీరు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు. కేరళలోని పడ్నా జిల్లాకు చెందిన ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మృతిచెందాడు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









