తుపాకీ ధరించిన వ్యక్తి ఆయుధ సామగ్రి ఇంటిపై దాడి..ఒక పౌరుని హతం
- May 03, 2017
జెడ్డా:ఒక పౌరుడు స్వంతం చేసుకున్న ఇంటిలో సాయుధ దొంగతనంపై ఈస్ట్రన్ ప్రావిన్స్ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు, అక్కడ నేరస్తులు ఒకరిని కిడ్నాప్ చేసి మరొకరిని హతమార్చారు, ఆ తర్వాత సంఘటనా స్థలం నుండి పారిపోయారని ప్రాథమిక సమాచారం సేకరించారు. భద్రతా అధికారులు ఈ కేసులో అనుమానితులను వెన్నంటే అనుసరిస్తూనే ఉన్నారు.తూర్పు ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్లా జియాద్ అల్-రుకీతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 5:15 గంటలకు భద్రతా గస్తీ, సిహటంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ముసుగుతో, మెషిన్ గన్ ధరించిన సాయుధలైన వ్యక్తులు సిహత్లోని వ్యవసాయ క్షేత్రంలో ఒకరికి చెందిన ఒక ప్రైవేట్ రెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకొని ఉన్నారు; వారు ఒక తుపాకీని పోలీసుల వద్ద నుంచి అపహరించారని తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు కిడ్నపీకు ఉపయోగించ ఆ వాహనాన్ని గుర్తించడంతో, నేరస్థులు సంఘటనా స్థలంలోనే ఆ వాహనాన్ని వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. కాగా ఆ అపహరించిన వాహనంలో కాల్చి చంపబడిన స్థితిలో ఒక వ్యక్తి మృతిదేహంను పోలీసులు కనుగొన్నారు. అవసరమైన చర్యలు పోలీసులచే తీసుకొని, ఆ నేరాలతో ప్రమేయం ఉన్నవారి ఉద్దేశాన్ని గుర్తించడానికి, తప్పిపోయిన వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించడానికి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









