జీసీసీ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయ్యేదెప్పుడు?
- October 06, 2015
ఆరు గల్ఫ్ దేశాల్ని కలిపే జీసీసీ రైల్ నెట్వర్క్ 2018 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15న ఆరు జీసీసీ దేశాల ప్రతినిథులు సమావేశమై ప్రాజెక్ట్ పరిస్థితిని సమీక్షించనున్నారు. 2,100 కిలోమీటర్ల మేర జీసీసీ రైల్వే విస్తరించనుంది. యూఏఈ 40 బిలియన్ దిర్హామ్లతో ఎతిహాద్ రైల్ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఇది జీసీసీ రైల్వేతో కనెక్ట్ కానుంది. 1,200 కిలోమీటర్ల లైన్ 2018లో పూర్తి కావాల్సి ఉంది. ఇది ప్రధాన పారిశ్రామిక జోన్లను, పట్టణాలను, పోర్టులను అనుసంధానం చేయనుంది. పబ్లిక్ వర్క్స్ మంత్రి అల్ నౌమి మాట్లాడుతూ ఒమన్ బోర్డర్ నుంచి సౌదీ బోర్డర్ వరకూ ఉన్న 1,200 కిలోమీటర్ల ప్రాజెక్టులో 264 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







