ఒంగోలులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
- May 19, 2017
ఒంగోలులోని ప్రముఖ వ్వవసాయ రసాయనాల తయారీ కేంద్రం భగీరథ కెమికల్స్లో శనివారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి మంటలు వెలువడి మూడంతుస్తుల ప్రధాన ఉత్పత్తి కేంద్రం నిలువునా అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ యాజమాన్య వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









