సెమీస్లో సానియా మీర్జా జోడీ
- May 19, 2017
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా సీజన్లో మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. నూతన భాగస్వామి యరస్లోవ ష్వెడొవా (ఖజకిస్థాన్)తో కలిసి మహిళల డబుల్స్లో సెమీ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ జోడీ సారా ఎరానీ, మటియె ట్రెవిసన్పై వరుస సెట్లలో గెలుపొందారు. సానియా జోడీ ఆధిపత్యం నడి చిన పోరులో 6-4, 6-1తో ఏకపక్ష విజయం సొంతమైంది. నేడు జరిగే సెమీఫైనల్లో మాజీ భాగస్వామి, స్విస్ స్టార్ మార్టినా హింగిస్, చన్ యంగ్ జన్ (చైనా) జోడీతో మూడో సీడ్ సానియా, యరస్లోవా తలపడనున్న ది. అంత కముందు ప్రీ క్వార్టర్స్లో ఉక్రెయిన్ అమ్మాయిలు వాకోవర్ ఇవ్వటంతో సానియా జోడీ నేరుగా క్వార్టర్స్కు చేరుకున్నది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









