సెమీస్లో సానియా మీర్జా జోడీ
- May 19, 2017
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా సీజన్లో మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. నూతన భాగస్వామి యరస్లోవ ష్వెడొవా (ఖజకిస్థాన్)తో కలిసి మహిళల డబుల్స్లో సెమీ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ జోడీ సారా ఎరానీ, మటియె ట్రెవిసన్పై వరుస సెట్లలో గెలుపొందారు. సానియా జోడీ ఆధిపత్యం నడి చిన పోరులో 6-4, 6-1తో ఏకపక్ష విజయం సొంతమైంది. నేడు జరిగే సెమీఫైనల్లో మాజీ భాగస్వామి, స్విస్ స్టార్ మార్టినా హింగిస్, చన్ యంగ్ జన్ (చైనా) జోడీతో మూడో సీడ్ సానియా, యరస్లోవా తలపడనున్న ది. అంత కముందు ప్రీ క్వార్టర్స్లో ఉక్రెయిన్ అమ్మాయిలు వాకోవర్ ఇవ్వటంతో సానియా జోడీ నేరుగా క్వార్టర్స్కు చేరుకున్నది.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









