కేరళలోని గురువాయుర్ ఆలయానికి బాంబు బెదిరింపు
- May 20, 2017
కేరళలోని ప్రసిద్ధ కృష్ణ మందిరం గురువాయుర్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక, ఆలయ నిర్వహణలో అవినీతి జరుగుతోందని సదరు వ్యక్తులు ఫోన్లో చెప్పినట్లు అధికారులు చెప్పారు.
ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్ రికార్డుల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆలయం వద్ద భద్రతను ఏర్పాటుచేశారు. బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు నిర్వహించారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గురువాయుర్ ఆలయం ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







