రమదాన్ సందర్భంగా షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- May 24, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో వివిధ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్, కౌన్సిలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ వెల్లడించారు. ఈ క్షమాభిక్ష, ఖైదీ కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపుతుందన్నారు. వివిధ దేశాలకు చెందినవారికి ఈ క్షమాభిక్ష లభించనుంది. మొత్తం 1,014 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందనున్నారు. షేక్ మొహమ్మద్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టిందన్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 977 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించిన మరుసటి రోజు ఈ ఆదేశం వచ్చింది.
తాజా వార్తలు
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!







