వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం
- May 24, 2017
మనామా: కింగ్డమ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జైళ్ళలో మగ్గుతున్న 400 మంది ఖైదీలకు శుభవార్త అందించారు. కోర్టులు విధించిన జరీమానాలు చెల్లించలేనివారు, అలాగే అప్పులు చేసి వాటిని తీర్చలేనివారు - ఇలా జైళ్ళలో మగ్గుతున్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారాయన. ప్యూర్ గోల్డ్ గ్రూప్ ఫౌండర్ మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని వెల్లడించారు. జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ అండ్ ఇంటీరియర్ మినిస్ట్రీస్తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారాయన. ప్రస్తుతం 10,000 బహ్రెయినీ దినార్స్ని ఈ కార్యక్రమం కోసం తమ గ్రూపు వెచ్చించనున్నట్లు వివరించారాయన. ఏడాదికి 120,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసి, ఖైదీలకు ఉపశమనం కల్పించనున్నట్లు తమ వ్యూహాల్ని వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు మర్చంట్ చెప్పారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









