వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం
- May 24, 2017
మనామా: కింగ్డమ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జైళ్ళలో మగ్గుతున్న 400 మంది ఖైదీలకు శుభవార్త అందించారు. కోర్టులు విధించిన జరీమానాలు చెల్లించలేనివారు, అలాగే అప్పులు చేసి వాటిని తీర్చలేనివారు - ఇలా జైళ్ళలో మగ్గుతున్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారాయన. ప్యూర్ గోల్డ్ గ్రూప్ ఫౌండర్ మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని వెల్లడించారు. జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ అండ్ ఇంటీరియర్ మినిస్ట్రీస్తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారాయన. ప్రస్తుతం 10,000 బహ్రెయినీ దినార్స్ని ఈ కార్యక్రమం కోసం తమ గ్రూపు వెచ్చించనున్నట్లు వివరించారాయన. ఏడాదికి 120,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసి, ఖైదీలకు ఉపశమనం కల్పించనున్నట్లు తమ వ్యూహాల్ని వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు మర్చంట్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









