వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం

- May 24, 2017 , by Maagulf
వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం

మనామా: కింగ్‌డమ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జైళ్ళలో మగ్గుతున్న 400 మంది ఖైదీలకు శుభవార్త అందించారు. కోర్టులు విధించిన జరీమానాలు చెల్లించలేనివారు, అలాగే అప్పులు చేసి వాటిని తీర్చలేనివారు - ఇలా జైళ్ళలో మగ్గుతున్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారాయన. ప్యూర్‌ గోల్డ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ మరియు ఛైర్మన్‌ ఫిరోజ్‌ మర్చంట్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాల్ని వెల్లడించారు. జస్టిస్‌, ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ మరియు ఎండోమెంట్స్‌ అండ్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీస్‌తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారాయన. ప్రస్తుతం 10,000 బహ్రెయినీ దినార్స్‌ని ఈ కార్యక్రమం కోసం తమ గ్రూపు వెచ్చించనున్నట్లు వివరించారాయన. ఏడాదికి 120,000 బహ్రెయినీ దినార్స్‌ ఖర్చు చేసి, ఖైదీలకు ఉపశమనం కల్పించనున్నట్లు తమ వ్యూహాల్ని వెల్లడించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు మర్చంట్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com