పెట్రోకెమికల్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం దెబ్బతిన్న 27 వాహనాలు
- May 25, 2017అల్ రాయ్:స్థానిక పెట్రోకెమికల్ కర్మాగారంలో బుధవారం సంభవించిన ఒక అగ్నిప్రమాదం సమర్ధవంతంగా అదుపు చేసినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం ఉదయం రాయ్ ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల పరిధిలో పెట్రోకెమికల్స్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక నియంత్రణ సమయంలో 27 వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2,000 చదరపు మీటర్ల పెట్రోకెమికల్ ప్లాంట్లో అగ్నిని అదుపులోనికి తెచ్చేందుకు ఆరు అగ్నిమాపక బృందాలు తక్షణమే ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి. ఎలాగైతే, పెట్రోకెమికల్ కర్మాగారంలో ఎగిసిపడిన భారీ జ్వాలలను అదుపు చేసినప్పటికీ పెద్ద స్థాయిలో ఆస్తులు నష్టం వాటిల్లిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒప్పుకుంది. ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద సంఘటనకు ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి సంబంధిత అధికారులచే పరిశోధన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..