పెట్రోకెమికల్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం దెబ్బతిన్న 27 వాహనాలు
- May 25, 2017
అల్ రాయ్:స్థానిక పెట్రోకెమికల్ కర్మాగారంలో బుధవారం సంభవించిన ఒక అగ్నిప్రమాదం సమర్ధవంతంగా అదుపు చేసినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం ఉదయం రాయ్ ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల పరిధిలో పెట్రోకెమికల్స్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక నియంత్రణ సమయంలో 27 వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2,000 చదరపు మీటర్ల పెట్రోకెమికల్ ప్లాంట్లో అగ్నిని అదుపులోనికి తెచ్చేందుకు ఆరు అగ్నిమాపక బృందాలు తక్షణమే ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి. ఎలాగైతే, పెట్రోకెమికల్ కర్మాగారంలో ఎగిసిపడిన భారీ జ్వాలలను అదుపు చేసినప్పటికీ పెద్ద స్థాయిలో ఆస్తులు నష్టం వాటిల్లిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒప్పుకుంది. ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద సంఘటనకు ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి సంబంధిత అధికారులచే పరిశోధన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







