దోలా-సాదియా భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్
- May 25, 2017భారత్: భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్కు శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలో ఉన్న ఈ ఫాస్ట్ ట్రాక్ బ్రిడ్జ్ ఆర్మీ ఇండియా-చైనా బోర్డర్కు చాలా కీలకమైనది. ఈ వంతెన నిర్మాణానికి 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ శంకుస్థాపన చేసినా... నిర్మాణం మాత్రం జరగలేదు. అయితే ఇండియా-చైనా బోర్డర్లో కీలకమైన ఈ ప్రాజెక్ట్ను సీరియస్గా తీసుకున్న కేంద్రం నిధులు కేటాయించి... మూడేళ్లలో పూర్తి చేసింది.
దోలా-సాదియా మధ్య లోహిత్ నదిపై ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. ఈ వంతెన పొడవు 9కిలోమీటర్లుకాగా... అస్సాం రాజధాని గౌహతికి సరిగ్గా 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరం. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జ్ కీలకమైనది. అలాగే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.
ప్రధానంగా ఆర్మీకి ఈ బ్రిడ్జ్ అత్యంత కీలకమైనది. అస్సాం నుంచి అరుణాచల్ప్రదేశ్లోని చైనా బోర్డర్కు వెళ్లేందుకు ఈ వంతెన ప్రధానమైనది. అంతేకాదు 60 టన్నుల బరువుండే యుద్ధ ట్యాంకులు బ్రిడ్జిపై నుంచి వెళ్లినా తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 950 కోట్లు ఖర్చయ్యింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం