ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో
- June 04, 2017
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ పోరుబాటపట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరద్యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, రాజాలు హాజరవుతున్నారు. గుంటూరు ఆంధ్రా-ముస్లిం కాలేజీ గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది. రాహుల్ ప్రత్యేక విమానంలోమధ్యాహ్నం మూడుగంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 5గంటల 15 నిమిషాలకు గుంటూరు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 7గంటల 30 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత కొద్దిసేపు కాంగ్రస్ నేతలతో సమావేశమై తిరిగి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తయ్యాయి. జాతీయ నేతలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!









