ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో
- June 04, 2017
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ పోరుబాటపట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరద్యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, రాజాలు హాజరవుతున్నారు. గుంటూరు ఆంధ్రా-ముస్లిం కాలేజీ గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది. రాహుల్ ప్రత్యేక విమానంలోమధ్యాహ్నం మూడుగంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 5గంటల 15 నిమిషాలకు గుంటూరు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 7గంటల 30 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత కొద్దిసేపు కాంగ్రస్ నేతలతో సమావేశమై తిరిగి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తయ్యాయి. జాతీయ నేతలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







