ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో

- June 04, 2017 , by Maagulf
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్‌ పోరుబాటపట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రాజాలు హాజరవుతున్నారు. గుంటూరు ఆంధ్రా-ముస్లిం కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనుంది. రాహుల్‌ ప్రత్యేక విమానంలోమధ్యాహ్నం మూడుగంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 5గంటల 15 నిమిషాలకు గుంటూరు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 7గంటల 30 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత కొద్దిసేపు కాంగ్రస్‌ నేతలతో సమావేశమై తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తయ్యాయి. జాతీయ నేతలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com