ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో
- June 04, 2017
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ పోరుబాటపట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరద్యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, రాజాలు హాజరవుతున్నారు. గుంటూరు ఆంధ్రా-ముస్లిం కాలేజీ గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది. రాహుల్ ప్రత్యేక విమానంలోమధ్యాహ్నం మూడుగంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 5గంటల 15 నిమిషాలకు గుంటూరు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 7గంటల 30 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత కొద్దిసేపు కాంగ్రస్ నేతలతో సమావేశమై తిరిగి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తయ్యాయి. జాతీయ నేతలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









