మందుగుండు సామాగ్రీని ఆన్ లైన్ లో అమ్మిన వ్యక్తి అరెస్టు
- June 06, 2017
ఆమధ్య సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ లో పిడకలు ..గొబ్బిమ్మలు ఆర్డర్ పై అమ్మడం..పలువురు కొనుగోలు చేయడం చూసి ఆశ్చర్యపోయాం .ప్రమాదం లేని పేడ తాలూకా వస్తువులు ..కనుక ఆపై పండుగ సమయంలో అంతగా లభ్యత ఉండదు కాబట్టి..ఆ విన్నూత్న ఆలోచన చేసి ఆన్లైన్ లో వ్యాపారం చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు. అదే రీతిలో మందుగుండు సామాగ్రిని సోషల్ మీడియా ద్వారా విక్రయించడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముహర్రక్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు, పోలీసులు ఒక చిట్కాని ఉపయోగించి ఆన్ లైన్ లో 900 ప్యాకెట్ల మందుగుండు సామాగ్రీ కావాలని ఆర్డర్ ఇచ్చారు. . కింగ్ ఫాహ్డ్ కాజ్వే ద్వారా అందచేసినందుకు నిందితుడు ఏర్పాట్లు చేశాడు. అరెస్ట్ కాబడిన ఆ నిందితుడు తన ఆరోగ్య పరిస్థితిని బాగోలేనందున ఆన్లైన్ లో ఈ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిపాడు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పేలుడు సామగ్రి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై 1976 లో 16 వ చట్టానికి సంబంధించిన 2 వ అధికరణ ప్రకారం, పేలుడు పదార్థాలను కలిగి ఉన్న వారెవరైనా రెండు నుండి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 50 నుండి 200 బహారిన్ దినార్ల మధ్య జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









