సూర్యుని క్రింద పని గంటలను పరిమితం చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ

- June 06, 2017 , by Maagulf
సూర్యుని క్రింద పని గంటలను పరిమితం చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ

అన్ని కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల మధ్య సమయంలో పని  నిషేధం విధించనున్నట్లు కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నిషేధం మూడు నెలల పాటు అమలుకానుంది. జూన్ 15 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వ తేదీ వరకు కొనసాగనుంది. తద్వారా   ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రత మరియు వృత్తిపరమైన ఆరోగ్య పరిరక్షణకు అనుగుణంగా ఏవైనా తీవ్రమైన య ప్రమాదాల నుండి కార్మితులను రక్షించడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతను కూడా ఈ దశ ప్రతిబింబిస్తుంది. మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖాలిద్ అబా అల్-ఖైల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము సూచించిన ఈ విధానాలను  ఈ పనిని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడానికి యజమానులు విధిగా పాటించాలని ఆయన  పిలుపునిచ్చారు. పని సంబంధిత సంఘటనలను తగ్గించడానికి రక్షణను మెరుగుపరిచేందుకు మంత్రిత్వ శాఖ పని చేస్తోందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిషేధిత పని గంటలలో  ఈ నిర్ణయం నుండి మినహాయింపు పొందాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల మధ్య సమయంలో పలు పని ప్రాంతాలను తనిఖీ చేసేందుకు వివిధ ప్రాంతాల గవర్నర్లతో కలిసి మంత్రిత్వ శాఖ సమన్వయం కానున్నట్లు ఆయన చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com