సూర్యుని క్రింద పని గంటలను పరిమితం చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ
- June 06, 2017
అన్ని కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల మధ్య సమయంలో పని నిషేధం విధించనున్నట్లు కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నిషేధం మూడు నెలల పాటు అమలుకానుంది. జూన్ 15 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వ తేదీ వరకు కొనసాగనుంది. తద్వారా ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రత మరియు వృత్తిపరమైన ఆరోగ్య పరిరక్షణకు అనుగుణంగా ఏవైనా తీవ్రమైన య ప్రమాదాల నుండి కార్మితులను రక్షించడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతను కూడా ఈ దశ ప్రతిబింబిస్తుంది. మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖాలిద్ అబా అల్-ఖైల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము సూచించిన ఈ విధానాలను ఈ పనిని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడానికి యజమానులు విధిగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. పని సంబంధిత సంఘటనలను తగ్గించడానికి రక్షణను మెరుగుపరిచేందుకు మంత్రిత్వ శాఖ పని చేస్తోందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిషేధిత పని గంటలలో ఈ నిర్ణయం నుండి మినహాయింపు పొందాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల మధ్య సమయంలో పలు పని ప్రాంతాలను తనిఖీ చేసేందుకు వివిధ ప్రాంతాల గవర్నర్లతో కలిసి మంత్రిత్వ శాఖ సమన్వయం కానున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









