పోర్చుగల్ అడవుల్లో మంటలు: 57 మంది మృతి, కార్లలోనే 30 మంది.
- June 18, 2017
పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 57 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ప్రాణాపాయం పెద్ద ఎత్తున సంభవించింది.
దాదాపు అరవై మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు 160 అగ్నిమాపక యంత్రాలు, వందల సంఖ్యలో సిబ్బంది శ్రమిస్తుంది.
అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. కార్లకు మంటలు వ్యాపించడంతో కార్లలో ఉన్న వ్యక్తులు కాలి బూడిదయ్యారని అధికారులు పేర్కొన్నారు. కార్లలో చనిపోయిన వారే 30 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది.
దట్టమైన పొగ కారణంగా మరికొందరు మృతి చెందారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదానికి మెరుపులే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాటర్ ప్లేన్స్ను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







